15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బీసీ అభ్యర్థులను గెలిపించుకుంటాం

05-12-2025 12:00 AM

15, 16 తేదీల్లో చలో ఢిల్లీ

తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్

ముషీరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి) : స్థానిక ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మోసం చేసి చీకటి ఒప్పదం చేసుకున్నాయని ఆరోపించారు.

ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ జేఏసీ నేతలు కుందారం గణేష్ చారి, గుజ్జ కృష్ణ, కులకచర్ల శ్రీనివాస్ లతో కలసి ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన ’ఛలో ఢిల్లీ’ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను అంశాన్ని పార్లమెంట్ లో రాహుల్ గాంధీ లేవనెత్తలేదని అన్నారు. గ్లోబల్ సమ్మిట్ కి ప్రధాని మోడీ, పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలను ఆహ్వానిం చడానికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారని చెప్పారు.

కానీ బీసీ డిమాండ్లపై చర్చించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి బీసీల ద్రోహి అని మండిపడ్డారు. ఈనెల 15న పార్లమెంట్ ముట్టడిస్తామని, 16న కేంద్ర మంత్రులు ఇండ్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు విక్రమ్ గౌడ్, లింగం, ప్రొఫెసర్ బాగయ్య, కవుల జగన్నాథం, మహిళా నేతలు తారాకేశ్వరి, సం ధ్య, ఉదయ్ నేత, తదితరులు పాల్గొన్నారు.