19-05-2024 12:05:00 AM
కరీంనగర్ సిటీ, మే 18: తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎప్సెట్(ఈఏపీ సెట్) పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. పరీక్షలో తమ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు వీ హాసిని 114, ఎన్ హేమంత్ 157, జీ శ్రీహాస్ 166, కే సుప్రియ 296, ఎన్ జ్ఞానద 480, వీ శ్రీముఖి 568, ఎం వర్షిత్ 575, జీ సాయిమంజునాథ్ రెడ్డి 610, పీ జ్మోతిర్మయిరెడ్డి 863, శ్రీవెన్నెల 876, తేజస్విని 942, ఎ శివ వరుణ్ 973, సీహెచ్ అనూహ్య 950, పీ శ్రీనాథ్ 986, మలిహాఫాతిమా 992వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. అలాగే 16 మంది వెయ్యిలోపు, 39 మంది 2 వేలలోపు, 63 మంది 3 వేలలోపు, 116 మంది 5 వేలలోపు ర్యాంకులు సాధించినట్లు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.