17-10-2025 09:04:23 PM
తాండూరు,(విజయక్రాంతి): 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటూ రాజకీయ అఖిలపక్షం, బీసీ సంఘాలు రేపు నిర్వహించే బంద్ మా సంపూర్ణ మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం మాజీ సభ్యులు ముస్తఫా తెలిపారు. తను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు మోసం చేస్తుందని విమర్శించారు. బీసీలు చేస్తున్న న్యాయపోరాటానికి తన సంపూర్ణ మద్దతును తెలిపారు.