20 June, 2026 | 8:42 PM

Breaking News

బాధిత కుటుంబాలకు ‘పీఎస్ఆర్’ భరోసా   •   మా అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఎస్పీ   •   సింగరేణి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: జి ఎం షాలెం రాజు..   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదు   •   మత్తు రహిత పటిష్ట సమాజ నిర్మాణానికి యోగ ఒక్కటే మార్గం   •   గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టి కృషి   •   ఉద్యాన పంటల సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరించాలి   •   అధిక సాంద్రత పత్తి సాగులో న్యూమాటిక్ ప్లాంటర్‌తో విత్తనాల విత్తకం ప్రదర్శన   •   డిజిటల్ లిటరసీ, ఏఐ నైపుణ్యంతో ఉజ్వల భవిష్యత్తు   •   రాజీ మార్గమే రాజమార్గం: సీనియర్ సివిల్ జడ్జి కే.సురేష్   •  

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం!

13-09-2025 05:38 PM

లారీ, జేసీబీ సీజ్

ముగ్గురిపై కేసు నమోదు

అశ్వాపురం  (విజయక్రాంతి): అశ్వాపురం మండలంలో ​జగ్గారం గ్రామంలోని శనివారం ఇసుక దందాకు అధికారులు అడ్డుకట్ట వేశారు. అక్రమంగా ఇసుకను నిల్వ చేసి, అక్కడి నుంచి ఇల్లందుకు తరలిస్తున్న ఓ లారీతో పాటు, దానికి సహాయపడిన జేసీబీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ​ఈ ఘటనకు సంబంధించి, మంచి కంటి నగర్‌కు చెందిన ఊకే సతీష్, ఇల్లందుకు చెందిన లారీ డ్రైవర్ భూక్య జానీ, జేసీబీ యజమాని పరుచూరి రాకేష్ లపై కేసు నమోదు చేసినట్లు అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి(CI Ashok Reddy) తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.