17 July, 2026 | 8:32 PM

Breaking News

పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •   మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపు   •   పట్టు చేనేత డైరెక్టర్‌కు సన్మానం   •   యథేచ్ఛగా చెట్ల నరికివేత.. పర్యావరణానికి ముప్పు   •   రానున్న గోదావరి పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలి   •   గ్రామ అభివృద్ధి కమిటీ వేధింపుల వల్లే ఆత్మహత్యయత్నం   •   రూరల్ జిల్లా బిజెపి(ఓబీసీ) అధ్యక్షులు మహేందర్ యాదవ్ కు ఘన సన్మానం   •   ప్రతిభ చాటిన విద్యార్థులకు ఘన సన్మానం   •   రోడ్డు పక్కనే చెత్తగుట్టలు కథనానికి స్పందించిన అధికారులు   •  

రాంచందర్ రావుకు శుభాకాంక్షల వెల్లువ

01-07-2025 06:05 PM

కరీంనగర్ (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) రాష్ట్ర శాఖ నూతన అధ్యక్షులుగా నియమితులైన రాంచందర్ రావు(Ramchander Rao)ను హైదరాబాదులో కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావుతో పాటు నాయకులు వేరువేరుగా శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి, సునీల్ రావులు మాట్లాడుతూ... నమ్మిన సిద్ధాంతం, పార్టీ బలోపేతం కోసం నిరంతరం ఎనలేని కృషిచేసిన నాయకుడిగా రాంచందర్ రావుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. సిద్ధాంతమే శ్వాసగా, బిజెపి యే ఊపిరిగా రాంచందర్ రావు రాజకీయ ప్రస్థానం కొనసాగిందని తెలిపారు.

విద్యార్థి దశనుండే సమస్యలపై రాజీలేని పోరాటం చేశారని, ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ జెండా ఎగరవేసిన  నేతగా రాంచందర్ రావుకు గుర్తింపు ఉందని తెలిపారు. నాడు నక్సలైట్లు బెదిరించిన, పోలీసులు లాటిలు జులిపించిన బెదరని ధైర్య, సాహసాలతో ముందుకు కొనసాగిన చరిత్ర రాంచందర్ రావుకు ఉందన్నారు. న్యాయవాదిగా, ఆర్ఎస్ఎస్ వాదిగా, రాజకీయవాదిగా నిరంతరం పేద, బడుగు, వర్గాల న్యాయం కోసం నిత్యం పరితపించే రాంచందర్ రావు నేడు బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులు కావడం సంతోషకరమన్నారు. రాంచందర్ రావు నాయకత్వంలో రాష్ట్రంలో బిజెపి మరింత బలోపేతం అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.