01-10-2025 12:44:56 AM
ఎల్లారెడ్డి సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు దుర్గా మాత అవతారం అవతరించిన దుర్గామాతకు అన్నాసాగర్ మాజీ సర్పంచ్ పెరుగు నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
గ్రామంలో అమ్మవారి దర్శనం కొరకు ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుని అమ్మ ప్రసాదం తీసుకుని వెళ్లారని మాజీ సర్పంచ్ నాగరాజ్ తెలిపారు. అందరూ చల్లంగా ఉండాలి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో గ్రామస్తులు ఉండాలని మాజీ సర్పంచ్ కోరుకున్నారు.