25 May, 2026 | 7:03 PM

Breaking News

మహిళా సంఘాలకు మరింత చేయూత   •   ట్రాక్టర్ బోల్తా.. ఇంటర్ విద్యార్థి దుర్మరణం   •   ఆ పన్నులను ఆదుకుంటేనే... జీవితంలో సార్ధకత   •   నకిలీ పత్తి విత్తనాల గుట్టు రట్టు.. నలుగురు నిందితులు అరెస్టు   •   ఆ దేవుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: పిల్లుట్ల రఘు   •   ఏడుపాయల చెక్‌డ్యాంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యం   •   ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •   పాలకోయ్యతండా, మంచి కనగర్ చిన్నారులను విద్యకు దూరం చేయవద్దు   •   రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం విద్యార్థి ప్రతిభ   •   ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి.. సిఐటియు డిమాండ్   •  

కల్తీ కల్లుకు మరొకరు బలి

25-07-2025 02:01 AM

ఇప్పటి వరకు 11 మంది మృతి

కూకట్‌పల్లి, జూలై 24: కల్తీ కల్లు తాగి చికి త్స పొందుతు న్న మరో వ్యక్తి మృతి చెందిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. దీంతో మృతుల సంఖ్య 11కు చేరింది. ఆల్విన్ కాలనీ హింద్రహిల్స్‌లో నివాసం ఉంటున్న విజయ్‌కుమార్ (35) బైక్‌పై రాపిడో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. సాయిచరణ్ కాలనీలోని కల్లు కాంపౌండ్‌లో ఈ నెల 6న కల్లు తాగాడు.

ఇంటికి వచ్చిన తర్వాత విరోచనాలు, వాంతులు కావడంతో కు టుంబ సభ్యులు స్థానికంగా ఉన్న ఓ ప్రై వేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప రిశీలించిన వైద్యులు గాంధీ ఆసుపత్రికి త రలించాలని  సూచించారు. అక్కడ చికి త్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు.