calender_icon.png 9 July, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

09-07-2025 03:37:49 PM

సమ్మెతో కేంద్రానికి కనువిప్పు కలగాలి

పట్టణంలో పలుచోట్ల నిరసన ర్యాలీలు

పెద్ద గడియారం సెంటర్లో సభ

నల్గొండ టౌన్(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన సమ్మెతో కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని వెంటనే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, ఐఎన్టీయుసి జిల్లా అధ్యక్షులు అంబటి సోమన్నలు డిమాండ్ చేశారు. బుధవారం సిఐటియు ఏఐటీయూసీ, ఐఎన్టీయుసీ, బీఆర్టీయు, ఐఎఫ్టియు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్ ల ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నారు.

వివిధ రంగాల కార్మికులు పట్టణంలో భారీ ర్యాలీలు నిర్వహించి పెద్ద గడియారం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడు ముందుకు తెచ్చిందని అన్నారు. పారిశ్రామిక సంబంధాల కోడ్ ద్వారా ఫిక్స్లు టర్మ్ ఎంప్లాయ్మెంట్ను చట్టబద్ధం చేసి రెగ్యులర్ ఉద్యోగుల భద్రతకు ముప్పు తెచ్చిందని అన్నారు ట్రేడ్ యూనియన్లను ఉద్యోగుల కార్మికుల సంఘటిత శక్తిని బలహీన పరుస్తుందన్నారు. లేబర్ కోడ్ ప్రకారం యాజమాన్యాలు సర్వీస్ కండిషన్స్ మార్చాలనుకుంటే ముందస్తు నోటీసు ద్వారా తెలియజేయాల్సిన అవసరం లేదని పారిశ్రామిక సంబంధాల కోడ్ అమనైతే 300 మందిలోపు పని చేసే పారిశ్రామిక సంస్థల్లో యాజమాన్యాలు ప్రభుత్వ అనుమతి లేకుండానే యదేచ్చగా కార్మికులను తొలగించవచ్చని పేర్కొన్నారు.

 ఏర్పాటు రిజిస్ట్రేషన్ లను కఠిన తరం చేస్తుందని అన్నారు. కార్మికులు సమ్మె చేయడం సాధ్యం కాకుండా ఆంక్షలు విధిస్తుందని తెలిపారు. సామాజిక భద్రత కోడ్ అమలు వల్ల ఉద్యోగులు పొందే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 12 నుండి 10 శాతానికి తగ్గిపోయిందని అన్నారు. వేతనాల కోడులో కనీస వేతనం నిర్ణయించడానికి ఎలాంటి శాస్త్రీయత ప్రతిపాదన లేదు డాక్టర్ ఆత్రాయుడు ఫార్ములాను తుంగలో తొక్కారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కనీస వేతనం 26000 అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

ఐఎఫ్టీయు రాష్ట్ర నాయకులు జ్వాల వెంకటేశ్వర్లు, బీఆర్టీయు రాష్ట్ర నాయకులు ఆర్.ఆచారి మాట్లాడుతూ... దశాబ్దాల పాటు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను హక్కులను భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గంపై ఉన్నదన్నారు. ప్రజల ఆస్తులను కార్పోరేట్లకు దోచిపెడుతూ మతోన్మాద చర్యల ద్వారా కార్మిక వర్గ ఐక్యతను విచ్చిన్నం చేసే చర్యలకు ప్రతిఘటించేందుకు సమ్మె పిలుపు ఇవ్వడం జరిగిందని అన్నారు. దేశవ్యాప్తంగా సమ్మె విజయవంతమైందని కేంద్రానికి ఈ సమ్మె కనువిప్పు కలగాలని వెంటనే కేంద్ర బిజెపి ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలని లేనియెడల తగిన విధంగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.