18 April, 2026 | 11:37 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు

20-05-2025 02:11 AM
  1. గుల్జార్‌హౌస్ ఘటన బాధాకరం 
  2. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్

హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి): ప్రజా స్వామ్య దేశంలో రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టుకునే హక్కు ఉంటుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అన్నారు. బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు కొత్త పార్టీ పెడుతున్నారనే ప్రచారం జరుగుతుందని మీడియా అడిగిన ప్రశ్నకు వీహెచ్ పైవిధంగా స్పందించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నదన్నారు. కాగా పాతబస్తీలో గుల్జార్‌హౌస్ అగ్ని ప్రమాద ఘటన బాధాకరమన్నారు.

అగ్ని ప్రమాద ఘటనను కొందరు నాయకులు రాజకీయం చేయడం సరికాదన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారని గుర్తు చేశారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించారని తెలిపారు. దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చారని వీహెచ్ పేర్కొన్నారు. సోమాజిగూడలో నిర్వహించే రాజీవ్‌గాంధీ 34వ వర్ధంతికి పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరుకావాలని ఆయన కోరారు.