17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఆపరేషన్‌ సింధూర్‌పై స్పందించిన ఏపీ సీఎం, మంత్రి లోకేశ్‌

07-05-2025 11:08 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత రక్షణ దళాలు లక్ష్యంగా దాడులు చేశాయనే నివేదికలకు ప్రతిస్పందనగా, దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు తమ ఆమోదం, ప్రశంసలను వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నాయకులు ఈ ఆపరేషన్‌ను ప్రశంసించారు. ఈ నేపథ్యంలో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్,  కేంద్ర పౌర విమానయాన మంత్రి కె.రామ్ మోహన్ నాయుడు కూడా స్పందించారు.

భారత దళాలు జరిపిన ఆపరేషణ్ సింధూర్ పై ఎక్స్ వేదికగా చంద్రబాబు స్పందిస్తూ.. “జై హింద్” అని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ సైతం జైహింద్.. న్యాయం జరిగింది అంటూ ట్వీట్ చేశారు. అలాగే మంత్రి కె.రామ్ మోహన్ నాయుడు కూడా స్పందిస్తూ.. ఉగ్రవాదాన్ని సహించేది లేదని, భారత్ మాతా కీ జై అని ట్వీట్ చేశారు.ఆపరేషన్ సంధూర్ పేరుతో చేపట్టిన దాడిలో భారత సైన్యం బాంబులతో పాక్ పై విరుచుకుపడింది. పాకిస్థాన్ అమెరికా దగ్గరకు పరుగులు పెట్టేలా చేసింది. ఈ క్రమంలో ఎక్స్ లో #IndiaPakistanWar, #OperationSindooor అనేది టాప్ లో ట్రెండ్ అవుతోంది.