calender_icon.png 5 January, 2026 | 7:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

04-01-2026 02:16:19 PM

ఈ నెల 21వ తేదీ వరకు గడువు

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించనున్న పరిక్ష కోసం అర్హులైన విద్యార్థులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్(Garima Agrawal) ప్రకటనలో తెలిపారు. టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్, టీజీటీడబ్ల్యూఆర్ఈఐఎస్, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్, టీజీఆర్ఈఐఎస్ గురుకులాల్లో 2026- 2027 విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో నూతన ప్రవేశానికి అలాగే ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఉన్న ఖాళీల భర్తీకి వచ్చే నెల ఫిబ్రవరి 22వ తేదీన ప్రవేశ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. 

దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన సర్టిఫికెట్లు

కుల, ఆదాయ ధ్రువీకరణ, ఆధార్ కార్డు నెంబర్, పుట్టిన తేదీ సర్టిఫికేట్, ఫోటోలు కావాలి.

ఈ కింది వెబ్ సైట్ లలో దరఖాస్తు చేసుకోవాలి