15 April, 2026 | 1:40 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి

04-01-2026 03:37 PM

బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ కుమార్

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి) : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్(Nadelli Vijith Kumar) కోరారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ లో ఆది వారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 1, 22, 23, 38, 39, 55, 56 డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గాదె సత్యం, మాజీ కౌన్సిలర్ శ్రీపతి శ్రీనివాస్, నాయకులు శ్రీరాముల మల్లేష్, MD.తాజుద్దీన్, పడాల శ్రీనివాస్, పడాల రవీందర్, కర్రు శంకర్, జెట్టి చరణ్, రాపర్తి కిషోర్, జాడి కల, డివిజన్ లోని నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.