13-05-2025 12:02:49 AM
మహబూబ్ నగర్ మే 12 (విజయ క్రాంతి) :ఈ నెల 16 న ప్రపంచ సుందరీమణుల పోటీలలో పాల్గొననున్న పోటీ దారులు ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పిల్లల మర్రి సందర్శించనున్న నేపథ్యం లో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. సోమవారం పిల్లల మరి దగ్గర పలు సదుపా యాలను ప్రత్యేకంగా పరిశీలించారు.
ఎస్పీ డి.జానకి, వివిధ శాఖల అధికారులతో పురావస్తు మ్యూజియం,పిల్లల మర్రి వృక్షం, దేవాలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పీ రాములు, డిఎస్పి వేంకటేశ్వర్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.