28 June, 2026 | 3:44 PM

Breaking News

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •  

పేదలకు దుస్తుల పంపిణీ చేసిన ఏయూ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు

10-01-2026 08:26 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): వెంకటాపూర్ లోని అనురాగ్ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ సెల్ యూనిట్-5 ఆధ్వర్యంలో పేదలు, నిరుపేదల సంక్షేమార్థం “క్లాత్స్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ నీడ్ ఫుల్ లైవ్స్ అనే సేవా కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఈకార్యక్రమం ప్రోగ్రాం ఆఫీసర్ బి. సంతోష్ కుమార్ నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనవరి 05 నుండి 08 వరకు దుస్తుల సేకరణ చేపట్టి బాచారం, మజర్‌గూడలోని ఫ్రెండ్స్ ఫౌండేషన్ వద్ద అవసరమైన వారికి దుస్తులు పంపిణీ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అవసరమైన దుస్తులు అందించి వారికి సహాయపడటమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు సేవాభావంతో పాల్గొని సమాజ సేవలో తమ బాధ్యతను చాటుకున్నారు. ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమం జాతీయ సేవా పథకం యొక్క మౌలిక సూత్రాలైన సేవ, సమర్పణ, సామాజిక బాధ్యతలను ప్రతిబింబించిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ... ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందిస్తాయని, భవిష్యత్తులో కూడా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.