15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వాగ్దేవి కళాశాలలో సంక్రాంతి సంబరాలు

10-01-2026 08:22 PM

పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని

హనుమకొండ,(విజయక్రాంతి): వాగ్దేవి కళాశాల ఆవరణలో ముగ్గులు వేసి, గొబ్బమ్మలను పేర్చి, భోగిమంటలు వేసి సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోగి మంటలను వెలిగించి ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొంటూ, అభివృద్ధితో పాటు సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని అన్నారు.

కళాశాలలో విద్యార్థులు వేసిన హరిదాసు వేషాదరణ పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వాగ్దేవి కళాశాల చైర్మన్ చందుపట్ల దేవేందర్ రెడ్డి దంపతులు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ చాడ స్వాతి శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు తడుక సుమన్, డైరెక్టర్ శ్రవణ్ రెడ్డి, నాయకులు సుగుణాకర్ రెడ్డి, అశ్విన్ రాథోడ్,బాలు నాయక్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.