13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఆస్ట్రేలియాదే యాషెస్ చివరి టెస్ట్

09-01-2026 12:00 AM

4 సిరీస్ కైవసం

సిడ్నీ, జనవరి 8 : యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో కంగారూలు 5 వికెట్ల తేడాతో గెలిచారు. ఒకానొక దశలో వరుస వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను మిడిలార్డర్ బ్యాటర్లు అలెక్సీ క్యారీ, కామెరూన్ గ్రీన్ నిలబెట్టడంతో మ్యాచ్ గెలిచింది. దీంతో ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4 కైవసం చేసుకుంది. 302 ప రుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు మరో 40 పరుగులే చేయగలింది.

ఆస్ట్రేలియాకు విజయానికి కేవలం 159 పరుగులు మాత్ర మే కావాల్సి వచ్చింది. ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, వెదరాల్డ్ మంచి భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ ఔటైన తర్వాత ఆసీస్ వెంట వెంటనే మరో 3 వికెట్లు చేజార్చుకుంది. విజయానికి 39 పరుగులు కావాల్సిన సమ యంలో క్యారీ, గ్రీన్ ఇద్దరూ కలిసి  మ్యాచ్ ముగించారు. మొదటి మూడు టెస్టుల్లో వరుసగా గెలిచిన ఆస్ట్రేలియా నాలుగో టెస్టు లో ఓడిపోయింది. సిడ్నీలో ఇంగ్లాండ్‌ను చి త్తు చేసి యాషెస్‌ను నిలబెట్టుకుంది. మిఛెల్ స్టార్క్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కాయి.