9 April, 2026 | 6:49 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ఆస్ట్రేలియాదే యాషెస్ చివరి టెస్ట్

09-01-2026 12:00 AM

4 సిరీస్ కైవసం

సిడ్నీ, జనవరి 8 : యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో కంగారూలు 5 వికెట్ల తేడాతో గెలిచారు. ఒకానొక దశలో వరుస వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను మిడిలార్డర్ బ్యాటర్లు అలెక్సీ క్యారీ, కామెరూన్ గ్రీన్ నిలబెట్టడంతో మ్యాచ్ గెలిచింది. దీంతో ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4 కైవసం చేసుకుంది. 302 ప రుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు మరో 40 పరుగులే చేయగలింది.

ఆస్ట్రేలియాకు విజయానికి కేవలం 159 పరుగులు మాత్ర మే కావాల్సి వచ్చింది. ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, వెదరాల్డ్ మంచి భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ ఔటైన తర్వాత ఆసీస్ వెంట వెంటనే మరో 3 వికెట్లు చేజార్చుకుంది. విజయానికి 39 పరుగులు కావాల్సిన సమ యంలో క్యారీ, గ్రీన్ ఇద్దరూ కలిసి  మ్యాచ్ ముగించారు. మొదటి మూడు టెస్టుల్లో వరుసగా గెలిచిన ఆస్ట్రేలియా నాలుగో టెస్టు లో ఓడిపోయింది. సిడ్నీలో ఇంగ్లాండ్‌ను చి త్తు చేసి యాషెస్‌ను నిలబెట్టుకుంది. మిఛెల్ స్టార్క్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, హెడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కాయి.