15 April, 2026 | 12:03 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

రోడ్డు భద్రత పట్ల అవగాహన

17-01-2026 12:00 AM

కోదాడ జనవరి 16: రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రతి ఒక్కరు సురక్షితంగా గమ్యానికి చేరాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్‌ఎలైవ్ కార్యక్రమంలో భాగంగా కోదాడ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కోదాడ మున్సిపాలిటీ కార్యాలయం, ఎమ్మార్వో కార్యాలయం, ఆర్డీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐ అంజిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు సురక్షితంగా గమ్యానికి చేరడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ప్రయాణ సమయంలో రోడ్డు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ వినియోగించాలని తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడపరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోందని, జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదా లను నివారించవచ్చని పేర్కొన్నారు.