13 July, 2026 | 5:26 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

డాక్టర్ల నిర్లక్ష్యంతో బాలింత మృతి

04-09-2025 11:13 PM

యాచారం: మండల పరిధిలోని నజ్దిక్ సింగారం గ్రామం(Singaram Village)లో విషాదం చోటుచేసుకుంది. కాన్పు కోసం వెళ్ళి బిడ్డ జన్మించిన అనంతరం తల్లి మృతి చెందింది. మహిళా మృతితో కుటుంబంలోనూ అటు గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. మండల పరిధిలోని నజ్దిక్ సింగారం గ్రామానికి చెందిన దార నిర్మల రెండవ కాన్పు కోసం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి వెళ్ళింది. బుధవారం  వైద్యుల నిర్ధారణ మేరకు నిర్మలకు పెద్దాపరేషన్ చేయాలని సూచించడంతో పెద్ద ఆపరేషన్ చేయగా పాప జన్మించింది. గురువారం ఉదయం ఆస్పత్రిలో  నిర్మల బాత్రూం తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు జారి పడిపోయింది. దీంతో ఆమెను మెరుగైన ఆరోగ్యం కోసమై గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలోనే నిర్మల మృతి చెందింది.  ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్మలను పట్టించుకోకపోవడం వల్లే నిర్మల మృతి చెందిందని బంధువులు గ్రామస్తులు ఆరోపించారు.