calender_icon.png 4 November, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలి

03-11-2025 08:50:23 PM

ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు సోమశేఖర్ రావు..

కామారెడ్డి (విజయక్రాంతి): బాన్సువాడ ఎమ్మెల్యే పరిగి శ్రీనివాస్ రెడ్డిపై అనర్హత వేటువేయాలని జాతీయ రైతు సంఘాల సమైక్య అధ్యక్షుడు సోమశేఖర రావు సోమవారం ఎన్నికల ప్రధాన కమిషనర్ కు వినతిపత్రాన్ని అందజేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్191 (1) (ఏ) ప్రకారం అనర్హతకు గురైన నేపథ్యంలో ఈ అంశంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషన్ ను కోరారు.