17 April, 2026 | 2:42 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

బాసరకు కేంద్రీయ విశ్వవిద్యాలయం కావాలి

02-01-2026 12:19 AM

భైంసా, జనవరి ౧ (విజయక్రాంతి): చదువులకు కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి బాసర లో కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసే విధంగా చూడాలని కోరుతూ గురువారం ముధోల్, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పాయల శంకర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విన్నవించారు. హైదరాబాదులో కిషన్ రెడ్డి నివాసంలో మంత్రి కలిసిన ఎమ్మెల్యేలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాసరలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని వారు మంత్రికి విన్నవించారు.