17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

రైతులకు మెరుగైన సత్వర సేవలు

13-05-2025 01:07 AM

డీసీసీబీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ 

జగిత్యాల, మే 12 (విజయక్రాంతి): స్వంత భవనాలు అత్యాధునిక సాంకేతికత వినియోగించడం ద్వారా రైతులకు మరిన్ని మెరుగైన సేవలను సత్వరమే అందించవచ్చని డీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని కల్లూరు రోడ్లో ఎస్సారెస్పీ క్యాంపు స్థలంలో నూతనంగా నిర్మించిన బ్యాంకు భవనాన్ని వారు ప్రారంభించారు.

అలాగే కోరుట్ల మండలంలోని సర్పరాజుపల్లి (మాదాపూర్), పైడిమడుగు, జోగిన్పల్లి గ్రామల్లో నూతనంగా నిర్మించిన ప్యాక్స్ గోదాములను కూడా వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ రైతులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకే నూతన నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు.

అర్హులైన రైతులందరూ ఈ సేవలను ఎప్పటికప్పుడు వినియోగించుకోవాలని వారు కోరారు.కోరుట్ల విండో చైర్మన్ ఎలిశెట్టి భూమిరెడ్డి, డైరెక్టర్లు, బ్యాంకు, ప్యాక్స్ అధికారులు, ఆయా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.