23 June, 2026 | 11:25 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

నూతన షెడ్డు నిర్మాణానికి భూమిపూజ

31-07-2025 01:31 AM

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్  ఎ.పావని వినయ్ కుమార్ 

ముషీరాబాద్, జూలై 30(విజయక్రాంతి): ఆర్ టీ సి క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఆవరణలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించ తలపెట్టిన షెడ్డు నిర్మాణం కొరకు బుధవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ శాసన సభ్యులు  ముఠా గోపాల్, మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్, గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్, బీజేపీ ఓబీసీ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు పూస రాజు పాల్గొన్నారు.

ఈ  కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, ఆలయ ఈ ఓ లక్ష్మా రెడ్డి, పునర్నిర్మాణ కమిటీ ఛైర్మెన్ మర్రిషెట్టి నర్సింగ్ రావు, కమిటీ సభ్యులు, బిజెపి డివిజన్ అధ్యక్షులు వి.నవీన్ కుమార్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.