12 June, 2026 | 1:53 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌కు బీనమోని మధుప్రియ

25-11-2025 12:32 AM

పదర, నవంబర్ 24: పదర మండల కేంద్రానికి చెందిన ఇంటర్ చదువుతున్న బీనమోని మధు ప్రియ రాష్ట్రస్థాయి అండర్-19 స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్లో అత్యంత ప్రతిభ కనబరిచింది. హైదరాబాద్ జింఖానా మైదానంలో జరిగిన పోటీల్లో 1,500 మీటర్ల పరుగు, 3,000 మీటర్ల పరుగు రెండు విభాగాల్లోనూ రజత పతకాలు కైవసం చేసుకుని జాతీయ స్థాయికి అర్హత సాధించింది.

ప్రస్తుతం నల్గొండ జిల్లా డిండి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల అథ్లెటిక్స్ అకాడమీలో కోచ్ పరశురాముడు వద్ద శిక్షణ పొందుతుంది. ఈ  నెల 26, 28 వరకు హర్యానా రాష్ట్రంలో జరగనున్న జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటున్నట్లు కోచ్ పరశురాముడు తెలిపారు.