12-08-2025 08:52:24 PM
మేడిపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్(Peerzadiguda Municipal Corporation) పరిధిలో బీజేపీ అధ్యక్షులు రాంపల్లి యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా ప్రచారంలో పాల్గొని మనం అందరం మన ఇళ్లలో జాతీయ జెండాను ఎగుర వేసి, మన దేశం పట్ల జాతీయ భావాన్ని, ప్రేమను పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కంజుల సుగుణ రెడ్డి, పీర్జాదిగూడ కార్యవర్గ కమిటీ సభ్యులు కొండకింది వాసుదేవ రెడ్డి, మల్లెల సంతోష్, తుపాకుల గోపాల్, మాధవిలత, మహేష్ యాదవ్, వెంకటేష్ గౌడ్ బీజేపీ కార్యకర్తలు, కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గోన్నారు.