20 March, 2026 | 11:00 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ బీజేపీ ర్యాలీ

05-12-2024 11:14 PM

ఖమ్మం,(విజయక్రాంతి): కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు, ఇతర హామిల అమలులో విఫలమైందని పేర్కొంటూ బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామిలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుందటూ బీజేపీ ఛార్జ్‌షీట్ విడుదల చేస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.జిల్లాకు చెందిన మంత్రులు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల అమలులో విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 66 మోసాలతో ప్రజల్ని నట్టేట ముంచిందని దుయ్యబట్టారు. ఈ ర్యాలీలో బీజేపీ జాతీయ నాయకులు,తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాల సహా ఇన్చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ,  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుల్లారావు, మంద సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.