22 March, 2026 | 8:44 PM

నేడు నిరుద్యోగ సమస్యలపై బీజేవైఎం మహాధర్నా

20-07-2024 12:48 AM

హాజరుకానున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలనే ఏకైక డిమాండ్‌తో బీజేవైఎం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద శనివారం మహాధర్నా జరుగనుంది. ఈ మహాధర్నాకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ ధర్నాకు నిరుద్యోగులు హాజరుకావాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ కోరారు.