06-01-2026 05:47:44 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలో మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మంగళవారం ఏర్పాటు చేశారు. మల్టీ డయాగ్నస్టిక్ ఆరోగ్య శిబిరాన్ని కాగజ్నగర్ అగ్రసేన్ భవన్ లో డి.ఎస్.పి ప్రారంభించారు. మార్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, ఎంపీడీవో సీనియర్ వైద్యులు, మాజీ బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్,ఎక్స్–ఆర్మీ అసోసియేషన్ సభ్యులు, యువ మాంచ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.