17-07-2025 05:49:13 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో గురువారం బోనాల పండుగ వేడుకలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి అనూష బోనాల పండుగ ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఎన్ఎస్ఎస్-1, ఎన్ఎస్ఎస్-2 కో ఆర్డినేటర్స్ డాక్టర్ ఎం జ్యోతి, కె రజిత ఆధ్వర్యంలో నిర్వహించారు.