9 May, 2026 | 1:36 PM

Breaking News

తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •  

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి...

04-07-2025 08:32 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): సమాజంలో ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం సాధించగలుగుతామని అందుకు మొదటి దశ బాల్య దశేనని ఎన్నారై జీడి అభినయ్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన సూర్యాపేట మాజీ జడ్పిటిసి జీడి బిక్షం కుమారుడు ఎన్నారై జీడి అభినయ్ కుమార్ శుక్రవారం తిమ్మాపురం జడ్పీహెచ్ఎస్ లో 150మంది విద్యార్థులకు సుమారు రూ.10వేల విలువగల నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి పాఠశాల దశలోనే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేస్తే సాధించలేనిది ఏమీ ఉండదన్నారు.తన తాత గ్రామ మాజీ సర్పంచ్ జీడి అంజయ్య ఆశయ సాధన కోసం ఎన్నారైగా తాను గ్రామానికి సేవలు అందించేందుకు సంకల్పంతో ఉన్నానన్నారు.