15 April, 2026 | 11:56 AM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

అంగన్వాడి టీచర్, ఆయా నిర్లక్ష్యంతో గుంతలో పడి బాలుడు మృతి

03-11-2025 07:36 PM

నకిరేకల్ (విజయక్రాంతి): అంగన్వాడీ టీచర్, ఆయా నిర్లక్ష్యం కారణంతో గుంతలో పడి బాలుడి మృతి చెందిన సంఘటన కేతేపల్లి మండలం కాసనకోడు గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కాసనగోడు గ్రామంలోని అంగన్ వాడి మొదటి కేంద్రంలో అదే గ్రామానికి చెందిన కుంచం జగదీష్ కుమారుడు అయాన్(4) చదువుతున్నాడు. బాత్రూం రావడంతో బయటకు వెళ్లి మల విసర్జన చేసినట్లు స్థానికులు తెలుపుతున్నారు. గతంలో జెసిబితో గుంతను తీశారు. ఆ గుంతలో బాలుడు వాష్  చేసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోయినట్లు స్థానికులు తెలుపుతున్నారు. పలు అనుమానాలకు తావు.. అంగన్ వాడి కేంద్రాల్లో పిల్లలను కంటికి రెప్పలా కావాల్సిన టీచర్, ఆయా నిర్లక్ష్యా కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అంగడి కేంద్రాల్లో పిల్లలకు కావలసిన అన్ని సౌకర్యాలు కలిగి ఉన్న.పిల్లలను మలవిసర్జన ,బాత్రూం కోసం బయటకు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఒక వేలా తీసుకువెళ్లిన పిల్లల వెంట ఆయా ఎందుకు వెళ్లలేదు. పిల్లలకు వాష్ చేయాల్సింది ఆయే కదా ఆమె ఏం చేస్తుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఇంతా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా అంగన్ టీచర్ల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతి చెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు వారిపై కఠిన చర్యలు తీసుకొని బాలుడు కుటుంబానికి తగిన న్యాయం చేయాలని  స్థానికులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక  ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక తహసిల్దార్, ఎంపీడీవో ఘటన స్థలానికి చేరుకొని జరిగిన ఘటనను వివరాలను అడిగి తెలుసుకున్నారు.