15 April, 2026 | 1:42 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

రోడ్లా నరకానికి రహదారులా?

03-11-2025 07:36 PM

మద్దెపురం రాజు సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు

గుండాల,(విజయక్రాంతి): గుండాల మండలంలోని రోడ్లు నరకానికి రహదారుల్లగా కనిపిస్తున్నాయని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దె పురం రాజు పేర్కొన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... మండల కేంద్రం నుండి వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్లపై ఏర్పడిన గుంతలకు మరమ్మత్తు పనులు చేపట్టాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గుండాల నుండి నూనెగూడెం మీదుగా సీతారాంపురం రోడ్డు వరకు వెళ్లే ప్రధాన రహదారితో పాటుగా రామారం నుండి వెల్మజాల, గుండాల గంగాపురం, తుర్కల షాపురం మోత్కూరు రోడ్లు గుంతల మయంగా మారి రాత్రిపూట, వర్షం పడ్డ సమయంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు.గుండాల మండలంలోని గుంతల మయంగా మారిన రోడ్లపై గుంతలను పూడ్చి ప్రజలను ప్రమాదాల నుండి కాపాడాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.