22-08-2025 06:21:02 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా అభిమాని, జలహిత అన్నపూర్ణ వంట మాస్టర్ నిచ్చకోల కృష్ణవేణి గురు స్వామి దంపతులు శుక్రవారం బెల్లంపల్లి కాంటా చౌరస్తా వద్ద బాటసారులు, రోజు కూలీలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవ సమితి అధ్యక్షులు ఆడెపు సతీష్, ఉపాధ్యక్షులు కందుల రాజన్న, కార్యవర్గ సభ్యులు దోలి సుకుమార్, భీమిని కనకయ్య, తిలక్ వాకార్స్ సభ్యులు పాల్గొన్నారు.