23-08-2025 11:57:01 PM
ఎల్బీనగర్ ఏసీపీకి బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు
ఎల్బీనగర్: ఓ ప్రైవేట్ సివిల్ కాంట్రాక్టర్, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డికి మధ్య జరుగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. ‘ఎల్బీనగర్ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు గంజాయి బ్యాచ్’ అని అనుచిత వ్యాఖ్యలు చేసిన కొప్పుల నర్సింహా రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ యువజన నాయకులు శనివారం ఎల్బీనగర్ ఏసీపీ, సీఐలను కలిసి ఫిర్యాదు చేశారు.
నిరాధార వ్యాఖ్యలు చేసిన కొప్పుల నర్సింహరెడ్డి ఆధారాలుంటే బయట పెట్టాలని, లేకపోతే ముక్కు నేలకి రాసి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ కొప్పులతో ఉండేదే.. గంజాయి బ్యాచ్, ఆయన చేసేది గంజాయి వ్యాపారం అంటూ మండిపడ్డారు. స్వయానా ఆయన బామ్మర్ది, ఆయన అనుచరుడు గంజాయి తీసుకునే ఆధారాలను ఏసీపీ, సీఐలకు అందించామని, తగు చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.