calender_icon.png 16 October, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరాచకం ఆగాలంటే బీఆర్‌ఎస్ గెలవాలి

16-10-2025 02:35:07 AM

-పదేండ్ల అభివృద్ధి, రెండేళ్ల అరాచక పాలనకు మధ్య ఎన్నిక

-జూబ్లీహిల్స్‌లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్ర ఆడబిడ్డల ఎదురుచూపు

-అన్ని వర్గాల అండతో మాగంటి సునీతదే విజయం 

-బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పార్టీల మధ్యనో, ఇద్దరు వ్యక్తుల మధ్యనో జరుగుతున్నది కాదని, పదేండ్ల అభివృద్ధి పాలనకు, రెండేళ్ల అరాచక పాలనకు మధ్య, పదేండ్ల రైతుబంధు, రెండేళ్ల రాక్షస పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ నామినేషన్ కోసం బయలుదేరే ముం దు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో ఆడబిడ్డ గెలుపు కో సం రాష్ర్టంలోని కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారని, సునీతా గోపీ నాథ్ గెలుపుతోనైనా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.2,500 ఇస్తుందని ఆశిస్తున్నారని తెలిపారు.

బీఆర్‌ఎస్ గెలిస్తే తమకు ఇచ్చిన హామీలను కాం గ్రెస్ అమలు చేస్తుందని లక్షల మంది రైతన్నటు ఆశిస్తున్నారని పేర్కొన్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, తర్వాత మోసపోయిన యువత, తమ ఇండ్లు కూలగొట్టిన అరాచకాలను చూసిన తర్వాత, ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలవాలి.. ఈ అరాచకాలు ఆగాలని హైదరాబాద్ నగర పేదలు ఎదురు చూ స్తున్నారని వెల్లడించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కూడా కట్టలేదని, కేసీఆర్ కట్టిన లక్ష ఇండ్లు, ఇచ్చిన ఇండ్ల పట్టా లు, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా నగర ప్రజలకు గుర్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన మైనార్టీలకు ఈ ఎన్నిక ఒక అవకాశంగా భావిస్తున్నారని తెలిపారు.

ప్రభుత్వంలో ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వకుండా దారుణంగా వారిని కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. తమకు ఇచ్చిన బీసీ డిక్లరేషన్, రిజర్వేషన్లు అన్నీ మోసమని, ఈ అంశంలో గుణపాఠం చెప్పడానికి రాష్ర్టవ్యాప్తంగా బీసీలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దళిత బంధు, అభయహస్తం పేరిట మోసపోయిన దళితులు కూడా ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ అభ్యర్థికి అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నదని, కేసీఆర్ ఆధ్వర్యంలో మరోసారి పాలన రావడానికి, హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక పునాది కాబోతున్నదని, మరోసారి రాష్ర్టంలో గులాబీ పార్టీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కాబోతున్నదని ధీమా వ్యక్తంచేశారు.

అన్ని వర్గాల అండతో తమ పార్టీ అభ్యర్థి సునీత ఘన విజయం సాధించబోతున్నారని, రెండేండ్ల ఈ విఫల కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరూ బీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. జూబ్లీహిల్స్‌లో ప్రతి ఒక్కరికి, నియోజకవర్గానికి విశేషమైన సేవలు అందించిన నాయకుడు గోపీనాథ్ అని, హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ గెలుపొందడంలో అప్పటి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గోపీనాథ్ కృషి కూడా ఉన్నదని గుర్తుచేశారు. సునీతా గోపీనాథ్‌కు సహాయం చేసేందుకు పార్టీ కీలక నాయకులంతా పనిచేయాలని అధినేత కేసీఆర్ ఆదేశించారని, అందరి ఆశీర్వాదాలతో సునీత ఎన్నికల్లో గెలవబోతు న్నారని తెలిపారు.

రెండు సెట్ల నామినేషన్ దాఖలు 

బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మొదటి సెట్ నామినేషన్ పత్రాలను షేక్‌పేటలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం దాఖలు చేశారు. మొదటి సెట్ నామి నేషన్ దాఖలు చేసే సమయంలో ఆమె వెంట మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావుగౌడ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, కార్పొరేటర్ దేదీ ప్యారావు ఉన్నారు. రెండో సెట్ నామినేషన్ వేసే సమయంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, సమీనా యాస్మిన్ తదితరులు ఉన్నారు.