12 May, 2026 | 10:55 AM

Breaking News

కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •   చెట్టుపై పండ్లను తినేందుకు వెళ్లి వలలో చిక్కుకొనిచనిపోతున్న పక్షులు   •   ఇల్లందులో రాజకీయ దుమారం..   •  

కూకట్‌పల్లిలో యువకుడి దారుణ హత్య

30-06-2025 10:59 PM

రౌడీషీటర్ షాహిద్‌గా గుర్తింపు..

కూకట్‌పల్లి (విజయక్రాంతి): కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్(Kukatpally Police Station) పరిధిలో ఓ యువకుడు దారుణ హత్య గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం కూకట్‌పల్లిలోని వడ్డేపల్లి యన్ క్లేవ్ సమీపంలో గల ఖాళీ ప్రదేశంలో పవన్ అనే స్నేహితుని పుట్టినరోజుకు హాజరైన మరో నలుగురు యువకులు షాహిద్, షాజిద్, సమీర్, మున్నా మద్యం సేవించి షాహిద్ ను హత్యచేశారు. పోలీసులకు సమాచారం తెలియడంతో సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కూకట్‌పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి మాట్లాడుతూ... బోరాబండకు చెందిన సయ్యద్ షాహిద్ సాజిద్‌ను డబ్బులు డిమాండ్ చేయడాన్ని భరించలేక ఒక నెల నుంచి షాహిద్‌ను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.

పవన్ పుట్టినరోజున అందరూ ఒక చోటకు చేరి మద్యం సేవించిన అనంతరం షాయద్ ను మద్యం బాటిల్ పగలగొట్టి గొంతులో పొడిచారు. మరో రెండు బాటిల్ లు తలపై పగలగొట్టారు. షాహిద్ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో ఇద్దరిని అరెస్టు చేశాక పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. అయితే బోరబండ కు చెందిన షాహిద్ సాజిత్ ఇద్దరు కూడా రౌడీ షీటర్లుగా గుర్తించినట్లు ఏసిపి వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వివరాలను  వెల్లడిస్తామని ఎసిపి పేర్కొన్నారు.