13-07-2025 04:25:39 PM
తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు(MP Raghunandan Rao)ను ఆదివారం ఉదయం కాంగ్రెస్ జిల్లా నాయకులు సర్పంచ్ బుడ్డ భాగ్యరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు. గతవారం రోజుల క్రితం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో శస్త్ర చికిత్స అనంతరం కోకాపేటలోని అతని స్వగృహంలో కలిసి ప్రజా క్షేత్రంలో సేవ చేయడానికి తొందరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.