13-12-2024 12:18:12 AM
బ్రిస్బేన్: బోర్డర్ ట్రోఫీ లో భాగంగా ఆసీస్తో మూడో టెస్టు ఆడేందుకు సిద్ధమైన టీమిండియా గబ్బా మైదానంలో గురువారం ప్రాక్టీస్ సెషన్లో బిజీగా గడిపింది. శనివారం నుంచి మూడో టెస్టు మొదలుకానున్న నేపథ్యంలో టీమిండియా ప్రాక్టీస్లో వేగం పెంచింది. కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఇక జట్టును అడ్రస్ చేసిన కోహ్లీ తన మాటలతో జట్టులో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశాడు. కోహ్లీ వ్యాఖ్యలను రోహిత్, బుమ్రా సహా జట్టు మొత్తం శ్రద్దగా వినడం విశేషం.