29-10-2025 08:49:46 PM
నకిరేకల్ (విజయక్రాంతి): కట్టంగూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం నల్లగొండ డీఎంహెచ్ఓ డాక్టర్ పి. శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాలానుగుణంగా వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వారి వెంట డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ శ్వేత, సిబ్బంది తదితరులు ఉన్నారు.