31-01-2026 02:01:42 AM
లక్షెట్టిపేట టౌన్, జనవరి 30 : లక్షెట్టిపేట కోర్టు ఆవరణలో శుక్రవారం రాష్ట్ర బార్ కౌన్సి ల్ ఎన్నికలు ఎలక్షన్ నిర్వహణ పర్యవేక్షనాధికారి స్థానిక జూనియర్ సివిల్ జడ్జి సాయి కిరణ్ కసమల, ఎన్నికల అధికారి ఎస్. ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సహాయకులుగా స్థానిక ఇన్చార్జి సూపరింటెండెంట్ ఎన్.శ్రీనివాస్, జూనియర్ న్యాయవాది షారూక్ రూమాన్ వ్యవహరించగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు ఇబ్బందులు తలెత్తకుండా ఎస్ఐ గోపతి సురేష్ బందోబస్తు ఏర్పాటు చేశారు.