05-01-2026 12:15:23 AM
డీఈవో విజయ
మెదక్, జనవరి 4 : నర్సాపూర్ బివిఆర్ఐటి కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హతకు నిర్వహించిన టెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు డీఈవో విజయం ఆదివారం తెలిపారు. జిల్లాలో పరీక్ష నిర్వహణకు ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయగా రెండో రోజులో భాగంగా మొదటి పేపర్ కు100, రెండో పేపర్ కు 100 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా మొదటి పేపర్కు 48 మంది హాజరు కాగా మధ్యా హ్నం నిర్వహించే పరీక్షకు 71 మంది హాజరైనట్లు చెప్పారు. మొత్తం 119 మంది హాజరు కాగా 81 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.