14 April, 2026 | 5:11 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

ప్రయాణంలో జాగ్రత్త అవసరం

24-01-2026 12:00 AM

కలెక్టర్ విజయేందిర బోయి

కోయిలకొండ , జనవరి 23 : ప్రయాణంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు వహించి ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మండల పరిధిలోని జమాల్పూర్ గ్రా మంలో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకుఅరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగం ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అధిక వేగం, త్రిబుల్ రైడింగ్ వంటి ప్రమాదకర చర్యలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతాయన్నారు.

అనంతరం కోయిలకొండ మండలంలో శ్రీ రామ కొండ గుట్ట దగ్గర మిషన్ భగీరథ పైప్ లైన్ నీటి శుద్ధి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అకస్మికంగా తనిఖీ చేశారు. మిషన్ భగీరథ ట్యాంక్ ను నిరంతరం శుభ్రంగా ఉంచుకోవాలని మిషన్ భగీరథ డీఈ, ఎఈ లను ఆదేశించారు. వేసవికాలం వస్తున్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేయాలని కలెక్టర్ సూచించారు. డిప్యూటీ ఎంఆర్‌ఓ, ఆర్డబ్ల్యూఎస్ శాఖ డీఈ, ఆర్‌ఐ, జమాల్పూర్ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు ఉన్నారు.