14 April, 2026 | 5:18 PM

Breaking News

జగన్నాధపురంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •  

బ్యాంక్ ఆధీనంలో ఉన్న భూమిని కాజేసిన ఘటనలో పది మందిపై కేసు..

12-10-2025 09:02 PM

ఇద్దరు బడా రియాల్టర్లను రిమాండ్ కు తరలించిన పోలీసులు..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో భూ కబ్జా కేసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా తప్పు చేసిన భూకబ్జాదారులందరిపై కేసులు నమోదు అవుతున్నాయి. జిల్లా ఎస్పీగా అఖిల్ మహాజన్ బాధ్యతలు స్వీకరించాక రియల్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది భూ మాఫియా దారులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా ఎస్.బి.ఐ బ్యాంకు అధీనంలోని భూమిని కబ్జా చేసిన ఘటనలో ఆదిలాబాద్ కు చెందిన బడా రియాల్టర్ లపై కేసులు నమోదు చేయడంతో పాటు రిమాండ్ కు తరలించడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.

ఆదివారం డీఎస్పీ జీవన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. బ్యాంక్ ఆధీనంలో భూమిని కబ్జా చేసిన కేసులో రమేష్ శర్మ, ఇబ్రహీం మహమ్మద్ @ మామ్ల సేట్, యతేంద్రనాథ్, హితేంద్రనాథ్, రాకేష్ శర్మ మనోజ్ కుమార్ అగర్వాల్, పూనం వ్యాస్, అనుపమ వ్యాస్, సర్వేయర్ శివాజీలపై కేసు నమోదు చేశారు. ఇందులో రమేష్ శర్మ, మామ్లా సెట్ ను అరెస్ట్ చేసి, 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించడం జరిగిందని డిఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.