calender_icon.png 27 August, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరరహిత సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యం

27-08-2025 01:50:23 AM

-గాంధారిలో 42 సీసీ కెమెరాలు ప్రారంభం ఒక్క సీసీ కెమెరా 100 మంది 

-పోలీసులతో సమానం.  జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

గాంధారి, ఆగస్టు 26 (విజయ క్రాంతి): నేరరహిత  సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యం అని  జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర  అన్నారు.  మంగళవారం కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో, ఎంట్రీ, ఎగ్జిట్, ముఖ్యమైన చౌరస్తాలలో, గ్రామంలో 42 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు.

నేరాలను నియంత్రించడంలో నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర వహిస్తాయి అన్నారు, సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చు, నేరరహిత  సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యం, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం, ప్రజలకు భద్రత, సెన్సాఫ్  ఆఫ్ సెక్యూరిటీ కలిగించడంలో సీసీ కెమెరాలు చాలా ముఖ్యం,అని నేరాలను నియంత్రించడంలో, నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర వహిస్తాయి, సీసీ కెమెరాలు 24 గంటల నిరంతరం పనిచేస్తాయని తెలిపారు.

జిల్లాలో నేరాల అదుపు చేయడానికి పోలీసులతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు భాగస్వామ్యం చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.   ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అందుకు గ్రామస్తులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో సీసీ కెమెరాలు ఉండి పనిచేయని సిసి కెమెరాలు విషయంలో, నూతన సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు. ప్రజలు కూడా ఇంటి ఆవరణలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

గ్రామాలలో పట్టణాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కనబడితే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు జియోట్యాగింగ్ ద్వారా కామారెడ్డి కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసే తర్వాత హైదరాబాద్ కమాండ్ కంట్రోల్స్ సెంటర్ కు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా  షాపుల యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఒక కెమెరా రోడ్డు వైపు పెట్టుకోవాలని సూచించారు. 

సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపారస్తులను,   వివిధ సంఘాల నాయకులను,  ప్రజా ప్రతినిధులను అభినందించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపారస్తులను,   వివిధ సంఘాల నాయకులను,  ప్రజా ప్రతినిధులను, గ్రామ అభివృద్ధి సంఘం, క్లాత్ అసోసియేషన్, మెడికల్ అసోసియేషన్, కిరాణా వర్తక సంఘం, ఫర్టిలైజర్స్ అసోసియేషన్, ఆర్‌ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్, అధ్యక్షులను కార్యవర్గ సభ్యులను మాజీ సర్పంచ్  సంజీవ్, మాజీ MPTC లు తూర్పు రాజు, శ్రీనివాస్, VౄC నాయకులు మల్లేష్, సాయిలు, నాయకులు సాయికుమార్, బెజుగం సంతోష్, సత్యం లను అభినందించి  సన్మానించారు. అలాగే ఇట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయుటలో ముఖ్యపాత్ర వహించిన SI ఆంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ రవి, సంజయ్ లను  SP  అభినందించినారు. ఈ కార్యక్రమంలో  అదనపు ఎస్పీ అడ్మిన్ కే నర్సింహారెడ్డి , ౄSP ఎస్ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ , సదాశివ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, గాంధారి ఎస్త్స్ర ఆంజనేయులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

వినాయక చవితి నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించాలి

బాన్సువాడ, ఆగస్టు 26 (విజయ క్రాంతి): బాన్సువాడ పట్టణంలో వినాయక ఉత్సవాలలో భాగంగా వినాయక చవితి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా ఎస్.పి. రాజేష్ చంద్ర మంగళవారం బాన్సువాడలో పర్యటించారు. ముందుగా వినాయకుల నిమజ్జనం సంబంధించిన రూట్ మ్యాప్ ను పరిశీలించి, పట్టణంలోని కల్కి చెరువు వద్ద నిమజ్జనం ప్రాంతాన్ని పరిశీలించారు.

అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరగాలన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ఫైర్ విషయంలో తగు జాగ్రత్తలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తల తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డి.ఎస్.పి. విట్టల్ రెడ్డి, సి.ఐ. అశోక్, మున్సిపల్ కమీషనర్ శ్రీహరి రాజు మరియు వివిధ శాఖల అధికారులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.