09-08-2024 03:23:18 PM
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించింది. 2014 నుంచి జమ్ముకాశ్వీర్ లో జరగని అసెంబ్లీ ఎన్నికలపై సీఈసీ 9 పార్టీలను సంప్రదింపులు జరిపింది. జమ్ముకశ్మీర్ లో సత్వరం ఎన్నికలు నిర్వహించాలని అన్ని పార్టీలు ముక్తకంఠంతో చెప్పాయని సీఈసీ పేర్కొంది. అక్కడి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారని సీఈసీ తెలిపింది.