09-08-2024 03:43:09 PM
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిజాబ్ నిషేధంపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. హిజాబ్ నిషేధించిన ముంబయి కళాశాల సర్కులర్ పై సుప్రీంకోర్టు స్టే విధించింది. హిజాబ్, బుర్కా, నిఖాబ్ ధరించకూడదన్న ముంబయిలోని చెంబూరు కళాశాల సర్కులర్ పై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. నచ్చిన దుస్తులు ధరించేందుకు విద్యార్థులకు అవకాశం ఉండాలన్న కోర్టు ముంబయి ఎడ్యుకేషనల్ సొసైటీ స్పందన తెలపాలని కోరింది. హిజాబ్ అంశంపై తదుపరి విచారణను ధర్మాసనం నవంబర్ కు వాయిదా వేసింది.