13 May, 2026 | 12:59 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

సెల్ టవర్ తొలగించాలి

09-09-2025 11:07 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని ప్రాణహిత కాలనీలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఎయిర్టెల్ సెల్ఫోన్ టవర్ పనులను నిలిపి వేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు(Commissioner Rajalingu)కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో ప్రస్తుతం ఉన్నటు వంటి జియో టవర్, సోలార్ ప్లాంట్ వల్ల వాతావరణం కాలుష్యం అవుతుందని, అంతేకాకుండా మొబైల్ టవర్ల ద్వారా వెదజల్లుతున్న రేడియేషన్ మూలంగా కాలనీలో నివసిస్తున్న కార్మికులు, ప్రజలు వృద్ధులు చిన్నారులు తరచు అనారోగ్యానికి గురవు తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎయిర్టెల్ టవర్ నిర్మాణ పనులను నిలిపి వేయాలని నిలిపివేయాలని కోరారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ నవనిర్మాణ పనులను నిలిపివేయాలని  సమయత కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.