02-08-2025 09:12:41 PM
తాసిల్దార్ కిషోర్ శర్మ
నాగారం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని నాగారం మండల తాసిల్దార్ హరి కిషోర్ శర్మ తాసిల్దార్ కార్యాలయంలో మాట్లాడుతూ NFBS కింద దరఖాస్తు చేసుకునే వారు 18-59 సంవత్సరాల వయసు 12-04-2017 తరువాత భర్తలు మరణంచిన స్త్రీ లకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.20 వేల రూపాయలు నగదు జమ చేయడం జరుగుతుంది. లబ్ది పొందాలి అనుకుంటే, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ,కులం సర్టిఫికెట్స్ భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు అకౌంట్ జిరాక్స్, 2 పీఎం వద్దనుండి ఎన్ఓసి , నోటరీ ,పాస్ ఫోటోలను జతపరచి ధరఖాస్తును తాసిల్దార్ కార్యాలయం అందజేయాలని అని అన్నారు.