1 August, 2026 | 6:09 PM

Breaking News

తల్లిపాలు బిడ్డకు అమూల్యమైన వరం   •   విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తున్న ప్రభుత్వం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి   •   సోనాల మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు   •   అనురాగ్ లో కెరీర్ క్యాటలిస్ట్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఫర్ ప్లేస్మెంట్ సక్సెస్ వర్క్ షాప్   •   గోదావరి ఉధృతి.. జలదిగ్బంధంలో బూర్గంపాడు   •   వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •  

రైతులు అధైర్య పడొద్దు... ప్రతి రైతుకు యూరియా అందిస్తాం...

14-09-2025 07:39 PM

శివంపేట్ పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకటరాంరెడ్డి..

శివంపేట్,(విజయక్రాంతి): శివంపేట్ ప్రాథమిక సహకార సంఘంలో చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ మండలంలోని ప్రతి రైతుకు యూరియా అందిస్తామని చెప్పారు. మండలంలో 23 వేల ఎకరాలు  రైతులు వరి కందులు మొక్కజొన్న పత్తి  వేశారు. రైతులు 19500 ఎకరాల వరి వేయడం జరిగింది. పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 23,300 బస్తాల యూరియా (1048 మెట్రిక్ టన్నులు) రైతులకుఅందజేశామన్నారు.రైతులు ప్రతి ఎకరాకు ఒక బస్తా యూరియా వాడాలని చెప్పారు.