15 June, 2026 | 10:00 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

05-12-2025 06:06 PM

చండూరు డిప్యూటీ తహసిల్దార్ చంద్రశేఖర్

మునుగోడు/చండూర్,(విజయక్రాంతి): రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన అవినీతి తిమింగలం చండూర్ డిప్యూటీ తాసిల్దార్ చంద్రశేఖర్. వివరాల్లోకి వెళితే గట్టుప్పల మండలం తెరటుపల్లి గ్రామానికి చెందిన  అక్రమ రిజిస్ట్రేషన్ పై సమాచార హక్కు చట్టం కింద ఫిర్యాదుధారుని మరణించిన నాన్నకి చెందిన భూమికి సంబంధించి గతంలో జారీ చేసిన మ్యుటేషన్ ప్రొసీడింగ్స్, సంబంధిత పత్రాలను ఫిర్యాదుధారునికి అప్పగించడానికి డిమాండ్ చేశారు. ఫిర్యాదు దారుడు ఏసీబీని ఆశ్రయించిన సదరు బాధితులు హైదరాబాద్ బాలాపూర్ లోని తన నివాసంలో ఏసీబీకి పట్టుబడి 20,000/-లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు దొరికిపోయాడు.ఈయన గతంలో మర్రిగూడ మండలంలో కూడ డిటిగా పనిచేశారు.అక్కడ కూడా అవినీతి ఆరోపణలు ఉన్నట్టుగా సమాచారం.