12 June, 2026 | 2:21 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

నర్సింగ్ విద్యార్థినిపై కెమికల్ దాడి

02-12-2025 01:56 AM

హనుమకొండ ఘటన

మహబూబాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): హనుమకొండ నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థినిపై కెమికల్ దాడి జరిగింది. సోమవారం కాజీపేట సమీపంలోని కడిపికొండ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువతిపై గుర్తుతెలియని యువకులు కెమికల్ దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

జనగామ జిల్లాకు చెందిన బాధిత యువతి హనుమకొండలోని నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ చదువుతోంది. సోమవారం సాయంత్రం సమీప బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.